హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్లోడ్ చేసుకోవాలని కోరింది.
Also Read.. ప్రభుత్వానికి ఆరోపణలు చేయడం తప్ప.. ఆలోచన లేదు
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు [email protected] మెయిల్కు పంపాలని పేర్కొంది. ఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు వెబ్సైట్ లో పొందుపరిచినట్లు తెలిపింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళసై ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.