Tuesday, May 14, 2024

కుమారులు పట్టించుకోకపోవడంతో..వృద్ధ దంపతుల ఆత్మహత్యయత్నం..!!

spot_img

అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కడుపున పుట్టిన పిల్లలు పట్టించుకోకపోవడంతో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఆగా మోత్కూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఆగా మోత్కూరు గ్రామానికి చెందిన మల్లె బోయిన లింగయ్య ,పెంటమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఒక కూతురు ఉన్నారు. ఇందులో ఒక కుమారుడు కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. అందరి పెళ్లిళ్లు జరిగి ఎవరి జీవితంలో వారు స్థిరపడరు. ఉన్న కొద్దిపాటి ఆస్తులు పంచేసుకొన్నారు. దంపతులు విడిగా ఉంటున్నారు. కాగా వృద్ధాప్యంతో మంచాన పడ్డ తల్లిదండ్రులను చూసుకోవల్సిన కొడుకులు గాలికో దిలేసారు.

దీంతో ఒకవైపు అనారోగ్యం.. ఆర్థిక ఇబ్బందులు.. ఆదరించే వారు లేక అష్ట కష్టాలు పడుతున్న వృద్ధ దంపతులు చావే శరణ్యమనుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.85 సంవత్సరాల మల్లె బోయిన లింగయ్య మృతి చెందగా భార్య పెంటమ్మ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలోచికిత్స పొందుతుంది. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కాగా కూతురు ఫిర్యాదు మేరకు మాడుగుల పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: భర్త మీద కోపంతో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి…నలుగురు మృతి..!!

Latest News

More Articles