Saturday, May 4, 2024

భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ కిడ్..!!

spot_img

ఈ మధ్య కాలంలో పలువురు సినీసెలబ్రెటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటే..మరికొందరు మాత్రం తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారు. సినీ ఇండస్ట్రీలో నటీనటులకు విడాకులు కొత్తేం కాదు. ఈమధ్యకాలంలో చాలా మంది విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హిరోయిన్ కూడా భర్త నుంచి విడాకులు తీసుకుంది. ప్రముఖ నటి హేమమాలిన ధరేంద్రల ముద్దుల కూతురు ఈషాడియోల్ తన 12ఏళ్ల వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికింది.

విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. పరస్పర అంగీకారంతో విడిపోవాలని భరత్ నేను తాను అనుకున్నామని..పిల్లలు మాత్రం తమకు చాలా ముఖ్యమని పేర్కొంది. ఉన్నట్టుండి విడాకులు ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈషా విడాకులు చర్చనీయాంశంగా మారాయి. ఈషా 2021లో భరత్ ను వివాహమాడింది.

సినిమాల్లో బిజీగా ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు బ్రేక్ ఇచ్చింది. తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఏడాది వరకు అన్యోన్యంగా ఉన్న భరత్, ఈషా..గతేడాది వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తతో దగ్గర ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఆ తర్వాత ఎప్పుడూ పిల్లలను ఫొటోలను మాత్రం షేర్ చేస్తూ ఉండేది. అప్పుడు ఇద్దరి మధ్య ఏమో జరిగి ఉంటుందని విడిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా విడిపోయినట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: కుమారులు పట్టించుకోకపోవడంతో..వృద్ధ దంపతుల ఆత్మహత్యయత్నం..!!

Latest News

More Articles