కేంద్రంలో పదేళ్ల బిజెపి పాలనలో రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష సాధింపు చర్యల కోసం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థల దురుపయోగం చేయడం సర్వసాధారణంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు ఈడీ ప్రదర్శించిన తొందరపాటు దుందుడుకు చర్యలపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.
Abuse of power and institutional misuse to settle political scores is something that has become increasingly common with BJP Govt in last 10 years
ED needs to answer Supreme Court on the inordinate rush to arrest when the matter is very much sub-judice & up for review in a…
— KTR (@KTRBRS) March 15, 2024
కవిత అరెస్టు అనంతరం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈడీ వ్యవహరించిన తీరుపైన రేపు సుప్రీంకోర్టు కు సమాధానం చెప్పాల్సి వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. కచ్చితంగా 19వ తేదీన జరిగే సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశం పరిగణలోకి వస్తుందని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్. ఈడి స్వయంగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని (అండర్ టేకింగ్) ను తుంగలో తొక్కి ఈరోజు అరెస్టు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. కచ్చితంగా న్యాయం గెలుస్తుందని…చట్టబద్ధంగా ఈ అంశంలో పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ కవిత అరెస్టు..రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు..!