హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పరిధి పెద్దమ్మ గుడి ములుపులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ (బుధవారం) పెద్దమ్మ గుడి మూల మలుపు దగ్గర కారు బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ కారు ఆపకుండా వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య