హైదరాబాద్: నగరంలోని ఓ హోటల్ లో దారుణ ఘటన జరిగింది. కస్టమర్ ఎక్స్ ట్రా పెరుగు అడిగాడని హోటల్ సిబ్బంది అతడిని కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట కు చెందిన లియాకత్ బిర్యానీ తినేందుకు మెరిడియన్ హోటల్ కు వచ్చాడు. ఈ క్రమంలో ఎక్స్ ట్రా పెరుగు తీసుకోవాని రావాలని అడగడంతో సిబ్బంది గొడవపడ్డారు.
Also Read.. తులసి మొక్కతో పాటు ఈ మొక్కను నాటితే లక్ష్మీదేవి నట్టింట్లో ఉన్నట్లేనట..!
దీంతో లియాకత్ పై హోటల్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఇరువురిని పొలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతుండగానే లియాకత్ సృహకోల్పోయాడు. హుటాహుటిన స్థానిక డెక్కన్ హాస్పిటల్ కు తరలించగా.. హాస్పిటల్ లో చికిత్స అందిస్తుండగానే లియాకత్ మృతి చెందాడు.
Also Read.. గుడ్ న్యూస్.. మినీ అంగన్వాడీల అప్గ్రేడ్
అనంతరం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. డెక్కన్ హాస్పిటల్ వద్ద రాత్రి మృతుడి స్నేహితులు ఆందోళన చేపట్టారు. దాడి జరిగిన తరువాత హాస్పిటల్ కు తరలించకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడంతోనే మృతి చెందాడని ఆరోపించారు.
Also Read.. ఊరిలోనే ఉంటూ ఈ బిజినెస్ చేస్తే..ప్రభుత్వ ఉద్యోగి కంటే ఎక్కువ సంపాదించవచ్చు..!!
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వచ్చి ఘటన తాలూకు వివరాలు తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీకి మీర్జా రెహమత్ బేగ్.. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసుకొని మెరిడియన్ హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.