అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిధిగా వెళ్లారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నిన్న అయోధ్యకు బయలుదేరారు పవన్. అయితే నేడు ఉదయాన్నే రామమందిర ప్రారంభోత్సవ వేడుకల్లో కనిపించాడు పవన్ కళ్యాణ్. ఏ సందర్భంగా ప్రాణ ప్రతిష్ట జరుగుతుండగా బయట ఆడియన్స్ గ్యాలరీలో పవన్ కళ్యాణ్ కనిపించాడు. అక్కడినుండి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు కూడా. ఈ సందర్భంగా అయోధ్య మందిరంలో పవన్ కళ్యాణ్ సెల్ఫీ ఫోటో వైరల్ అవుతుంది.
‘శ్రీరాముడు మన భారత నాగరికత యొక్క వీరుడు. రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తిలకించడం నాకు కన్నీళ్లు తెప్పిస్తుంది. శ్రీరాముడిని తిరిగి ‘అయోధ్య’లోకి తీసుకు రావడానికి ఐదు శతాబ్దాల పోరాటం పట్టింది” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కొద్దిసేపటి క్రితం. పవన్ కళ్యాణ్ అయోధ్యలో కొంత ఆధ్యాత్మిక సమయాన్ని గడుపుతున్నాడని, ఆయన రామ మంత్రాన్ని ఆరాధిస్తున్నాడని ఆయన తాజా ట్వీట్ లో తెలిపారు. ఇక ఆ తరువాత ఆలయం ముందు దిగిన సెల్ఫీని ట్విట్టర్లో షేర్ చేస్తూ.. రామకార్యం అంటే రాజ్యకార్యం.. ప్రజాకార్యం.. జైశ్రీరామ్.. అంటూ ట్వీట్ చేశారు.