Saturday, May 18, 2024

ఓటీటీలోకి ‘బ్రో’ సినిమా

spot_img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదాయ సిత్తం అనే సినిమాని తెలుగులో ‘బ్రో’ పేరుతో రీమేక్ చేశారు. తమిళ సినిమాకు దర్శకుడైన సముద్రఖని.. తెలుగులో కూడా డైరెక్ట్ చేశారు. అయితే తెలుగు నేటివిటికీ తగినట్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి డైలాగ్స్ అందించడమే కాక స్క్రీన్ ప్లే కూడా అందించారు. తమిళ సినిమాలో సముద్రఖని పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించగా.. తంబి రామయ్య పోషించిన పాత్రను తెలుగులో సాయి ధరమ్ తేజ్ పోషించారు.

ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా వచ్చే శుక్రవారం (ఆగస్టు 25) నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Latest News

More Articles