Saturday, May 11, 2024

విషాదం..ఉదోగ్యం పోతోందనే భయంతో పేటీఎం ఎంప్లాయ్ సూసైడ్.!

spot_img

పేటీఎం పేమెంట్స్ సంస్థల్లో పనిచేస్తున్న 35 ఏళ్ల ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. ఈ వార్తను పీటీఐ సంస్థ తెలిపింది. ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందన్న భావనతో ఇండోర్ కు చెందిన ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ నివేదికలో వెల్లడించింది. ఆదివారం నాడు తన ఇంట్లో గుప్తా సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి వినియోగదారుల నుంచి డిపాజిట్లు, క్రెడిట్లను స్వీకరించకూడదని పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పేటీఎం సంస్థ ఆర్బీఐ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ తరుణంలోనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఇది కూడా చదవండి : విదేశాల్లో చదువుకునేందుకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.!

Latest News

More Articles