ఎయిర్ ఇండియాకు చెందిన పాత విమానాన్ని ముంబై తరలిస్తుండగా బ్రిడ్జి కింద చిక్కుకుంది. స్క్రాప్ చేసిన ఈ విమానాన్ని ట్రక్కుపై ముంబైకి తీసుకెళుతుండగా జాతీయ రహదారి 27పై ఈ ఘటన జరిగింది.
అస్సాం నుంచి ఈ విమానాన్ని ట్రక్కుపై తీసుకెళ్తుండగా బీహార్ లోని మోతిహారి దగ్గరున్న ఓ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. బ్రిడ్జి చిన్నగా ఉండడంతో ట్రక్కు ముందుకు వెళ్లడం సాధ్యం కాలేదు. వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా కుదరలేదు. దీంతో రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ సిబ్బంది.. విమానాన్ని తీస్కెళ్తున్న ట్రక్కు టైర్లలో గాలిని తగ్గించారు. ఎత్తు కాస్త తగ్గడంతో ట్రక్కు బయటపడింది. ఆ తర్వాత తిరిగి టైర్లలో గాలిని నింపిన అధికారులు.. ట్రక్కును విమానంతో సహా అక్కడి నుంచి తరలించారు.
ఇది కూడా చదవండి: ఆ రెండు రోజులు ‘అభయ హస్తం’ దరఖాస్తులు స్వీకరించరు