Sunday, May 19, 2024

దేశంలో మ‌త‌ ఘ‌ర్ష‌ణ‌ల‌ను సృష్టించేందుకు ప్ర‌ధాని మోదీ ప్రయత్నం

spot_img

చెన్నై: దేశంలో మ‌త‌ప‌ర‌మైన ఘ‌ర్ష‌ణ‌ల‌ను సృష్టించేందుకు ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ అన్నారు. దేశంలో ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు చేయాల్సి అవ‌స‌రం ఉంద‌న్న ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యలపై తాజాగా ఆయన స్పందించారు.

రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నెగ్గేందుకు ప్ర‌జ‌ల్ని ఆయ‌న క‌న్‌ఫ్యూజ్ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. బీజేపీకి ప్ర‌జ‌లే గుణ‌పాఠం చెబుతార‌ని ఆయ‌న పేర్కొన్నారు. విప‌క్షాలు ఐక్యం కావడంతో ప్ర‌ధాని మోదీ భ‌య‌ప‌డ్డార‌ని, అందుకే  కుటుంబ రాజ‌కీయాల గురించి మోదీ మాట్లాడుతున్నట్టు స్టాలిన్ అన్నారు.

Latest News

More Articles