Saturday, May 18, 2024

న్యూఇయర్ వేడుకల సందర్భంగా పోలీసుల ఆంక్షలు

spot_img

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ లో పోలీసుల ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుండి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్ మూసివేయనున్నారు. అలాగే పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవే మూసివేస్తారు. కేవలం ఏయిర్ పోర్ట్ కు వెళ్లే వారికి మాత్రమే అనుమతి ఉంటుందని కమిషనర్ వెల్లడించారు. దీంతోపాటు సైబరాబాద్ పరిధిలో ఉన్న అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు.

న్యూ ఇయర్ వేల ఆటో, ట్యాక్సీ , క్యాబ్ డ్రైవర్లకు పోలీసులు హెచ్చరించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే పెనాల్టీతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు. పబ్ లలో మద్యం సేవించి వాహనం నడపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా స్పెషల్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుండి సైబరాబాద్ లిమిట్స్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని, మద్యం మత్తులో తాగి రోడ్డు ప్రమాద మరణానికి కారణం అయితే వారిపై మర్డర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Latest News

More Articles