జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రేపు( గురువారం) జరగనున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ కౌన్సిలర్, మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు ఇంటిని ఇవాళ( బుధవారం) చుట్టుముట్టారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున హరిబాబు ఇంటి దగ్గరకు చేరుకున్నారు. దీంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి హరిబాబు పై కేసు నమోదు అయిందని తెలుపుతూ పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.
తనకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి హాజరుకావాలని ఆర్డీవో నోటీసులు పంపించారు. ఇప్పుడు ఇలా అక్రమంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని హరిబాబు తెలిపారు.
ఇది కూడా చదవండి: రేపు 10వ తరగతి హాల్ టికెట్లు విడుదల