Sunday, May 19, 2024

సీఎం కేసీఆర్ తో పొన్నాల భేటీ

spot_img

మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ రాజకీయ నేత పొన్నాల లక్ష్మయ్య ఆదివారం నాడు ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

పొన్నాల దంపతులను సాదరంగా ఆహ్వానించిన సిఎం కేసీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభలో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎం పీ కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత డా. దోసోజు శ్రవణ్ తదితరులున్నారు.

Latest News

More Articles