Wednesday, May 22, 2024

జనగామ నియోజకవర్గంలో కేసీఆర్‌ 7 రిజర్వాయర్లు నిర్మించారు

spot_img

కాంగ్రెస్‌లో 45 ఏళ్లు ఉండి అవమానాలకు గురయ్యానని తెలిపారు సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య. జనగామ మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో ఇవాళ(సోమవారం) నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నాల.. ఎన్నికల నేపథ్యంలోనే పలు రాజకీయ పార్టీలు కులగణనను తెరమీదకు తీసుకొస్తున్నాయని అన్నారు. కానీ.. కేసీఆర్‌ సీఎం అయిన 3 నెలలకే కులగణన, సమగ్ర సర్వే చేపట్టారని గుర్తు చేశారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్‌ 7 రిజర్వాయర్లు నిర్మించారని తెలిపారు. జనగామ అత్యున్నత అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ లో చేరానన్నారు. జనగామ జిల్లాకు మరింత ప్రోత్సాహకం ఇవ్వాలని, పాడిపరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు పొన్నాల లక్ష్మయ్య.

ఇది కూడా చదవండి: భువనగిరి లో మళ్ళీ గెల్చేది శేఖర్ రెడ్డినే

Latest News

More Articles