Sunday, May 19, 2024

తెలంగాణలో పలువురు ఐపీఎస్ లకు ప్రమోషన్..స్టీఫెర్ రవీంద్రకు ?

spot_img

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఐజీ స్టీఫెన్ రవీంద్రకు అదనపు డీజీ క్యాడర్ పదోన్నతి కల్పించింది. జోయల్ డేవిస్,ప్రకాశ్ రెడ్డిలను డీఐజీలుగా..సత్యనారాయణ, సుమతి, రంగనాథ్, కార్తీకేయ, రమేశ్ నాయుడులకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అటు ఐఏఎస్‌ల కు పోస్టింగ్ లను ఇచ్చింది. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్- నీటిపారుదల శాఖ ప్రత్యేక కారుదర్శిగా నియామకం. షేక్ రిజ్వాన్ పాషా- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ని జనగామ కలెక్టర్ గా నియామకం. మిక్కిలినేని మను చౌదరి- కామారెడ్డి అదనపు కలెక్టర్,సిద్దిపేట కలెక్టర్ గా నియామకం, Ch. శివలింగయ్య- జనగామ కలెక్టర్, శైలజా రామయ్యర్- దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: యూపీ సీఎం కాన్వాయ్ లో ప్రమాదం..11 మందికి గాయాలు.!

Latest News

More Articles