Sunday, May 19, 2024

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు.. రూ.6.80 లక్షలు రికవరీ

spot_img

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ముగ్గురు యువకులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‎కు పంపారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ షేక్ అమీర్, షేక్ ఫిరోజ్, ఆమీర్ అనే ముగ్గురు నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. ఈ నెల 13న మీర్ పేట్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో వీరిని అరెస్టు చేశారు. వీరిని విచారించగా.. పలు కేసులలో వీరు నిందితులని తేలింది. వీరి నుండి రూ. 6,80,000 నగదును రికవరీ చేశారు. వీరిపై సుమారుగా 20కి పైగా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. తెలంగాణలోనే కాకుండా.. మహారాష్ట్రలోనూ వీరి మీద పలు కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు.

Latest News

More Articles