గత నెల డిసెంబర్ 13న సినీ నటుడు సోనూసూద్ ట్విట్టర్ లో ఓ వీడియోని పోస్ట్ చేశారు. అందులో కదులుతున్న రైల్లో సోనూసూద్ ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తూ కనిపించారు. రైల్ హ్యాండ్ ను పట్టుకుని రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని.. రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించారు. దీనిపై అప్పట్లో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. రియల్ హీరోని సున్నితంగా హెచ్చరించారు.
రైల్లో ఇలా ప్రయాణించడం చాలా ప్రమాదకరమని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ‘డియర్ సోనూ సూద్.. మీరు ఎంతో మందికి రోల్ మోడల్. ఇలా రైలు మెట్లపై ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఇలాంటి వీడియోలతో మీ అభిమానులకు తప్పుడు మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. మరోసారి ఇలాంటివి చేయకండి. రైలు ద్వారా సున్నితమైన, సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి’ అంటూ పోస్టు చేసింది.
ఈ విమర్శలపై తాజాగా సోనూ క్షమాణలు తెలియజేశారు. ‘రైలు డోరు దగ్గరనే మగ్గిపోతున్న పేదల జీవితాలను అర్థం చేసుకునేందుకు నేను అక్కడ కూర్చుకున్నాను. రైల్వే వ్యవస్థ పనితీరు మెరుగుపరిచినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
— sonu sood (@SonuSood) December 13, 2022