హైదరాబాద్: కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. ఈ సినిమా ట్రైలర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేసిన అనంతరం సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కార్తికేయకు, చిత్ర బృందానికి రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్పారు.
డిసెంబర్ 21, 1012… ప్రపంచమంతా యుగాంతం వస్తుందని భయపడ్డారు. కానీఆ రోజు యుగాంతం రాలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్లోని లంక గ్రామాల్లో ఓ గ్రామమైన బెదురులంకలో కొందరు కేటుగాళ్ళు ఏం చేశారనే దాని చుట్టు సినిమాను తీశారు. ఆగస్టు 25న సినిమా విడుదల కానుంది.