Sunday, May 19, 2024

జీవితంలో ఇది ఒకేసారి.. రామ్ చరణ్ భావోద్వేగం..!

spot_img

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం చారిత్రాత్మక ప్రారంభోత్సవం భారతదేశం అంతటా భావోద్వేగాలతో ప్రతిధ్వనించింది. ఈ మహత్తర ఘట్టాన్ని కళ్లారా వీక్షించడానికి వివిధ రంగాల నుండి ప్రముఖ వ్యక్తులు అయోధ్యకి వచ్చారు. ఇక మెగా ఫ్యామిలీ అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  నటుడు రామ్ చరణ్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేషనల్ మీడియా ANIతో రామ్ చరణ్ ముచ్చటించారు. అయోధ్య రామమందిరం అద్భుతం… జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం… ఈ మహత్తర ఘట్టాన్ని కనులారా వీక్షించడం ప్రతి ఒక్కరికీ గౌరవమని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అన్నారు.‘శ్రీరాముడు మన భారత నాగరికత యొక్క వీరుడు. రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తిలకించడం నాకు కన్నీళ్లు తెప్పిస్తుంది. శ్రీరాముడిని తిరిగి ‘అయోధ్య’లోకి తీసుకు రావడానికి ఐదు శతాబ్దాల పోరాటం పట్టింది” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇక ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం పూర్వ జన్మ సుకృతమన్నారు.

Latest News

More Articles