Monday, May 20, 2024

రామేశ్వరం కేఫ్‌  పేలుడు కేసు..జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగింత

spot_img

బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌ లో పేలుడు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇవాళ( సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర నిర్ణయంతో పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది.

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్‌ రామేశ్వరం కేఫ్ లో శుక్రవారం బాంబ్‌ బ్లాస్ట్  జరిగింది. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాస్క్‌, క్యాప్‌ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చినట్లు గుర్తించారు. ఇడ్లీని ఆర్డర్‌ చేసుకొని ఒక దగ్గర కూర్చుని.. పేలుడుకు ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. అతడు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లోని బాంబుకు టైమర్‌ సెట్‌ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు.

ఇది కూడా చదవండి: ఢిల్లీ మహిళలకు ఆప్ సర్కారు గుడ్ న్యూస్

Latest News

More Articles