రంగారెడ్డి జిల్లాలో రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 30 ఆటోలను సీజ్ చేశారు. రాజేంద్రనగర్లో రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని, నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్లో నడుస్తున్న ప్యాసెంజర్ ఆటోలపై అడ్డుకున్నారు. వాయిలేషన్ ఆఫ్ పర్మిట్ చేయడమే కాకుండా ప్రయాణీకులను ఇబ్బంది పెడుతున్నట్లు గుర్తించారు. పర్మిట్, ఫిట్ నెస్, ఇన్సూరెన్స్ లేకుండా ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అధికారులు తెలిపారు. 30 ప్యాసెంజర్ ఆటోలను సీజ్ చేసి రాజేంద్రనగర్ సీజింగ్ యార్డ్కు తరలించారు.