Sunday, May 19, 2024

‘విక్రమార్కుడు-2’పై రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు

spot_img

హైదరాబాద్: హీరో రవితేజ అక్టోబర్‌ 20న ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Also Read.. ఇజ్రాయెల్‌కు సర్వీసులపై ఎయిరిండియా కీలక నిర్ణయం

వచ్చే ఏడాది మరో కామెడీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు రవితేజ తెలిపారు. అందులో బ్రహ్మానందం కూడా ఉంటారని చెప్పారు. అలాగే త్వరలోనే ఓ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌ పై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఈ విషయంపై రాజమౌళితో ఇప్పటి వరకు మాట్లాడలేదన్నారు. రాజమౌళితో కలిసి వర్క్‌ చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు.

Also Read.. సినీప్రియులకు బంపర్ ఆఫ‌ర్.. రూ.700ల‌కే 10 సినిమాలు

యాక్షన్‌, డ్రామా, ఎమోషన్‌.. ఇలా ఏ రకమైన సినిమాలో నటించినా తన లక్ష్యం మాత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమేనని రవితేజ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తన బయోపిక్ తెరకెక్కితే దానికి ‘మాస్‌ మహారాజా’ అనే టైటిల్‌ను పెడతానని రవితేజ అన్నారు.

Latest News

More Articles