Saturday, May 4, 2024

ఆర్బీఐ : యూపీఐ పేమెంట్స్ పరిమితి పెంపు

spot_img

న్యూఢిల్లీ:  ఫోన్‌పే, గూగుల్ పే, భారత్‌పే, పేటీఎం వంటి మొబైల్ యాప్స్‌ వినియోగదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో ఆన్‌లైన్‌, రికరింగ్ చెల్లింపుల పరిమితిని తాజాగా పెంచింది. ఇప్పటివరకు రూ.లక్ష వరకు మాత్రమే ఉన్న పరిమితిని రూ.5 లక్షలకు, ఈ-రికరింగ్ పేమెంట్స్ పరిమితి రూ.లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.

ప్రస్తుతం రూ.15 వేలపైన రికరింగ్ ట్రాన్సాక్షన్లకు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్ (ఏఎఫ్ఏ) అవసరం. కానీ తాజాగా ఆ పరిమితిని రూ.లక్ష వరకూ పెంచుకున్నట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు. దీనివల్ల మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పేమెంట్, క్రెడిట్ కార్డు రీపేమెంట్స్‌కు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు.

Latest News

More Articles