ఖమ్మం జిల్లా: మిచౌంగ్ తుఫాను దృష్ట్యా ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రాగల రెండు రోజులు భారీ వర్ష సూచన చేశారు. దీంతో రేపు(మంగళవారం) అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్. హాస్టల్ విద్యార్థులు హాస్టల్ విడిచి బయటకు రాకూడదని, హాస్టళ్లలోనే వుండాలని సూచించారు. సహాయానికి జిల్లా కంట్రోల్ రూం 1077, 9063211298 ని సంప్రదించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.