Sunday, May 19, 2024

నాటి బలి దేవత నేడు దేవత ఎలా అవుతుంది

spot_img

రేవంత్ రెడ్డి భాష, తీరుపై మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. సిఎం హోదాలో ఉండి హుందాగా ప్రవర్తించాల్సిన వ్యక్తి సోయి లేకుండా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యాడు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తేనే హామీలు నెరవేరుస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ భవన్ లో కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఎందుకు ఆ మాటలు చెప్పలేదు. ప్రజలను బ్లాక్మెయిల్ చేసే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియాగాంధీని గౌరవిస్తాము. సోనియాగాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అనలేదా. అప్పుడు బలిదేవత అని తిట్టి ఇప్పుడు అవసరం కోసం తెలంగాణ తల్లి, దేవత అని రేవంత్ రెడ్డి పోగుతున్నాడు.

తెలంగాణలో అనేక పోరాటాలు, బలిదానాల తర్వాతనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హుజూర్ నగర్ లో పోటీ చేస్తే పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయలేదా. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయింది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం బిఆర్ఎస్ పార్లమెంట్ ఉభయ సభల్లో అనేక పోరాటాలు చేసింది. విభజన హామీలపై కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారా. బిఆర్ఎస్ ఎంపీలు 4,658 ప్రశ్నలు పార్లమెంట్ లో అడిగారు. తెలంగాణపై కుట్రలు చేసే విధంగా రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన బోగస్ హామీలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. నిరుద్యోగులకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పంగనామం పెట్టింది. ఓట్లు వేయించుకుని ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. బిఆర్ఎస్ నేతలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం బిఆర్ఎస్ నిలబడుతుంది

Latest News

More Articles