Saturday, May 18, 2024

ఏడాదిలో రూ.2,069 కోట్లు కోల్పోయిన రిషి సునాక్ దంపతులు..!

spot_img

హైదరాబాద్: బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌, అక్షత మూర్తి దంపతుల సంపద ఏడాదిలో వేల కోట్లు తగ్గింది. ‘ది సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌-2023’ ప్రకారం.. ఏడాదిలో రిషి-అక్షత దంపతులు 201 మిలియన్‌ పౌండ్ల(రూ.2,069 కోట్లు) సంపదను కోల్పోయారు.

2022లో 730 మిలియన్‌ పౌండ్ల (రూ.7,104 కోట్లు)తో 222వ స్థానంలో నిలిచిన రిషి దంపతులు.. ఈ ఏడాది 529 మిలియన్‌ పౌండ్ల(రూ.5,448 కోట్లు)తో 275వ స్థానానికి పడిపోయారు. ఇన్ఫోసిస్‌ లో అక్షత షేర్ల విలువ తగ్గడతంతోనే వారి సంపద కరిగిపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

కాగా, ఈ జాబితాలో 35 మిలియన్‌ పౌండ్లతో ఈ హిందుజా కుటుంబమే బ్రిటన్‌ సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు.

Latest News

More Articles