Sunday, May 19, 2024

తాళాలు పగులగొట్టి ఇంట్లో భారీ చోరీ

spot_img

తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగుల గొట్టి చోరీ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్ కాలనీకి చెందిన తన్నీర్ శేఖర్ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దొంగలు.. ఇంటి తాళాలను పగులగొట్టి రూ. 3,50,000 లక్షల నగదు, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులు, 2 ల్యాప్ ట్యాప్‎లను ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనం గురించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన కామారెడ్డి పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: చెత్తకుప్పలో వందల సంఖ్యలో ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు

Latest News

More Articles