టీ20 క్రికెట్ లో రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. పొట్టి క్రికెట్లో 11 వేల పరుగుల మైలురాయి దాటిన రెండో ఇండియన్ క్రికెటర్గా నిలిచాడు. ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)తో మ్యాచ్ సందర్భంగా ఈ రికార్డును నమోదు చేశాడు.
11 వేల పరుగుల క్లబ్లో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు 11,864 పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తరఫున 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ మరో రికార్డు నమోదు చేశాడు.