Tuesday, May 21, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లో రూ.16,400 కోట్ల అప్పులు చేసింది

spot_img

కేసీఆర్ ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్ల అప్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారని… కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు నెలల కాలంలోనే రూ.16,400 కోట్ల అప్పులు చేసిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. దీనికి సంబంధించి ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ అప్పులకు తోడు అనధికారికంగా కార్పోరేషన్ల పేరుతో అప్పును రెండింతలు చేశారని ఆరోపించారు. వీటిని బడ్జెట్‌లో కూడా చూపించరన్నారు.

కేసీఆర్ చేసిన అప్పులతో కనీసం మౌలిక సదుపాయాలు వచ్చాయని తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులతో అభివృద్ధి జాడే కన్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యారెంటీల గారడీ నడుస్తోందని విమర్శించారు. ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్.

ఇది కూడా చదవండి: అప్పుల్లో ఉన్నారా.. ఇక్కడికి వెళ్తే వెళ్తే చాలు అన్ని తీరిపోతాయట

Latest News

More Articles