Saturday, May 11, 2024

అప్పుల్లో ఉన్నారా.. ఇక్కడికి వెళ్తే వెళ్తే చాలు అన్ని తీరిపోతాయట

spot_img

సాధారణంగా మన భారతీయులకు బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ముందుగా గుర్తు చేసుకునేది దేవున్ని మాత్రమే. ఆ దేవుడి కరుణాకటాక్షాలు ఉంటే ఎలాంటి సమస్యలైనా తొలిగిపోతాయని నమ్ముతారు. అప్పులతో బాధపడేవారు ఈ దేవాలయానికి వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయట. అప్పులు కూడా తీరిపోతాయని నమ్మకం ఉంది. ఈ దేవుడి పేరు చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి.

జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది.  దీన్ని తెలంగాణ తిరుపతిగా పిలుస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి నడుచుకుంటూ వచ్చి చిల్పూరు గుట్టపై వెలిశారని చరిత్ర చెబుతోంది. పూర్వం ఆ శ్రీమన్నారాయణ శ్రీనివాస అవతారంలో భూలోకానికి వచ్చి పద్మావతిని వివాహం చేసుకుంటాడు. ఈ వివాహ ఖర్చులకోసం కుబేరుడి దగ్గర అప్పు చేస్తాడు. కానీ ఆ స్వామివారికి అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పు చెల్లించాల్సిన గడువు దగ్గర పడుతుండడంతో స్వామివారికి బుగులు మొదలవుతుంది. అలా భయంతో స్వామివారి పడుకున్న సమయంలో చిలుపూరు ప్రదేశమంతా కలలో కనిపిస్తుంది.

మేల్కొన్న తర్వాత చిలుకూరు గుట్ట దగ్గరకు  నడుచుకుంటూ వెళ్లి అక్కడ కొండపై ఉన్న గుహలోకి వెళ్లి స్వామివారు బుగులుతో తపస్సు చేస్తాడు. ఆ సమయంలోనే ప్రత్యక్షమైన కుబేరుడు స్వామి వారిని క్షమాపణ కోరుతాడు. అయితే చిలుపూరు గుట్ట ప్రదేశానికి స్వామి వారు వెళ్తేనే ఆయన అప్పులకు పరిష్కారం దొరికిందని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి చాలామంది భక్తులు అప్పులు, ఇతర ఏదైనా సమస్యలు ఉంటే అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుంటే అన్నీ నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం.

ఇది కూడా చదవండి: వంద రోజుల పాలనలో దందాలు తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదు

Latest News

More Articles