Friday, May 10, 2024

వంద రోజుల పాలనలో దందాలు తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదు

spot_img

వంద రోజుల కాంగ్రెస్ పాలనలో వసూళ్లు, దందాలు తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం స్థాయి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడుతూ ఢిల్లీకి మూటలు పంపుతున్నారని కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ( బుధవారం) నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గర్‌పల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను  పరిశీలించిన జగదీష్ రెడ్డి…ఆ తర్వాత మాట్లాడారు.

నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద రెండు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే ఏ ఒక్క మంత్రికి, ఎమ్మెల్యేలకు సోయలేదు. రెండు తడులు నీళ్లు అందిస్తే పంటలు గట్టెక్కేవి, కానీ, జిల్లా మంత్రులకు ఆ ఆలోచన లేదు. రైస్ మిల్లర్లను, క్రషర్ ఓనర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

జిల్లా మంత్రులు ఇసుక దందాలో బిజీ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. మిల్లర్లతో మంత్రులు కుమ్మక్కు కావడంతో రైతులకు తక్కువ ధరలు చెల్లిస్తూ మిల్లర్లు దోపిడీ మొదలుపెట్టారన్నారు. ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదన్నారు. కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మిల్లర్లతో మాట్లాడి.. రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే మంత్రులను గ్రామాల్లోకి రానివ్వబోమని హెచ్చరించారు. 100 రోజుల పాలనలో రాజకీయాలు వసూళ్లు దందాలు తప్ప కాంగ్రెస్ నేతలు ఓరగబెట్టిందేమీ లేదన్నారు జగదీష్ రెడ్డి.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్.. మీకు రైతులంటే చిన్నచూపెందుకు

Latest News

More Articles