సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారే తప్ప రైతుల గోడు పట్టించుకోవడం లేదెందు కంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు. రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా, వడగండ్లు పడుతున్నా పట్టించుకోలేదు.
నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా..? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..? ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..? సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..? ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంట నష్టంపై లేదెందుకు ? పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా..? హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా..? ఇంతకాలం.. పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు.. ఇప్పుడు.. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..? గుర్తు పెట్టుకోండి.. ఎద్దేడ్సిన ఎవుసం.. రైతేడ్సిన రాజ్యం బాగుండదు .. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై.. భారత రైతు సమితి పోరాడుతూనే ఉంటది.. అని సీఎంను ఉద్దేశించి ప్రశ్నలు గుప్పించారు కేటీఆర్.
ముఖ్యమంత్రి గారు..
రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు..
నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు..ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప..
గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా…?
అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..??ఎన్నికల గోల… pic.twitter.com/CUcrdomGku
— KTR (@KTRBRS) March 20, 2024