Monday, May 20, 2024

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట: మధ్యంతర బెయిల్ మంజూరు

spot_img

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఇవాళ(శుక్రవారం) ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. కోర్టు కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కస్టడీ పొడిగించారు. ఈ నేపథ్యంలో.. ఇవాళ సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది.

ఈ మధ్యంతర బెయిల్‌ జూన్ 1 వరకు వర్తిస్తుందని.. తిరిగి జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుందని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది సుప్రీం.

ఇది కూడా చదవండి:జనం మెచ్చిన నాయకుడు..కేసీఆర్

Latest News

More Articles