Friday, May 17, 2024

ట్రూ ట్రెండ్ సెట్టర్.. సాయిబాబా సన్నిధిలో.. సాయిపల్లవి న్యూ ఇయర్..!

spot_img

గ్లామర్ షోకి దూరంగా కథ నచ్చితే ఎంత డీ గ్లామర్ రోల్ అయినా చేస్తుంది సాయిపల్లవి. ప్రేమమ్ తో వెండితెర ఎంట్రీ ఇచ్చి.. ఫిదాతో తెలుగు ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. అయితే సాంప్రదాయ పాత్రలు, ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకే సాయిపల్లవి ప్రియారిటి ఎక్కువ. డబ్బులిస్తే ఐటం సాంగ్స్ కి కూడా చిందులేసే సమంత, తమన్నా, పూజ హెగ్డే వంటి హీరోయిన్స్ కి సాయిపల్లవి పూర్తి బిన్నం. ఇలాంటి సాయి పల్లవి మరోసారి తన గొప్ప క్యారెక్టర్ తో వార్తల్లో నిలిచింది. నిన్న జరిగిన న్యూ ఇయర్ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అంబరాన్నంటాయి. పబ్బులు, బార్లు పార్టీలతో కళకళలాడాయి. ముఖ్యంగా బాలీవుడ్ టు టాలీవుడ్ తారలంతా మత్తులో తుగారని అంటున్నారు.

ఇలాంటి తరుణంలో సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి మాత్రం తన న్యూ ఇయర్ వేడుకలని భక్తిశ్రద్దలతో దైవసన్నిధిలో జరుపుకోవటం.. ఆమెపై మరింత అభిమానాన్ని పెంచేసింది. ప్రతి సంవత్సరం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రార్ధనలు జరుపుతుంటారు. ఈ సందర్భంగా సాయి పల్లవి చీరకట్టుతో సాంప్రదాయంగా సాధారణ భక్తురాలిగా దైవ చింతనలో కొత్త సంవత్సరం వేడుకలో పాల్గొంది. సాయి పల్లవిని చూడగానే అభిమానులు ఆమెతో సెల్పీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సాయిపల్లవి త్వరలో సినిమాలకు పూర్తిగా దూరం అవబోతున్నారని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

Latest News

More Articles