Friday, May 17, 2024

సచివాలయం ప్రాంగణంలో ఆ విగ్రహంపై సర్కార్ పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత

spot_img

సెక్రటేరియట్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరారు కవిత. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి గుర్తు చేశారు.

ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు ఎమ్మెల్సీ కవిత. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్లకు మాకు అపారమైన గౌరవం ఉందని..తెలంగాణ తల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యం అన్నారు. రాష్ట్రం సాంస్క్రుతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: బరువు తగ్గాలంటే..ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి..!!

Latest News

More Articles