పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసిన ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడు సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు రెండ్రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ పోలీసులు సాయికృష్ణను నిన్న(గురువారం) కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ(శుక్రవారం) రాత్రి నిందితుడిని హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. తద్వారా అప్సర హత్యకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించనున్నారు. శనివారం మధ్యాహ్నంతో సాయికృష్ణ కస్టడీ ముగియనుంది.