Monday, May 20, 2024

అప్సర హత్య కేసులో ఇవాళ రాత్రి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

spot_img

పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసిన ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడు సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు రెండ్రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో శంషాబాద్‌ పోలీసులు సాయికృష్ణను నిన్న(గురువారం) కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ(శుక్రవారం) రాత్రి నిందితుడిని హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. తద్వారా అప్సర హత్యకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించనున్నారు. శనివారం మధ్యాహ్నంతో సాయికృష్ణ కస్టడీ ముగియనుంది.

Latest News

More Articles