Friday, May 10, 2024

 కట్నం అడిగాడని వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు కుటుంబం

spot_img

పెళ్లి సమయంలో వరుడు అనుకున్న దానికన్నా మరింత కట్నం డిమాండ్ చేశాడు. దీంతో పెళ్లి ఆగిపోవడంతో పాటు…ఆ పెళ్లి కుమారుడిని…వధువు తరపు బంధువులు చెట్టుకు కట్టేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగింది. పెద్దలు కుదిర్చిన ఓ వివాహంలో భాగంగా అక్కడి సంప్రదాయ ‘జై మాల’ వేడుకలో వరుడు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. వరుడు అమర్జీత్ వర్మ స్నేహితులు అనుచితంగా ప్రవర్తించడంతో వధూవరుల కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పరిస్థితికి మరింత ఆజ్యం పోస్తూ వరుడు అమర్జీత్ వధువు కుటుంబం నుంచి కట్నం మరింత డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత గొడవకు కారణమైంది.

పలు దఫాలుగా చర్చలు జరిపినా రెండు కుటుంబాలు ఒక అంగీకారానికి రాకపోవడంతో వధువు తరఫు వాళ్లు వరుడిని చెట్టుకు కట్టేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వరుడిని విడిపించి అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి రద్దుకావడంతో  వివాహ వేడుక ఏర్పాట్ల కోసం అమ్మాయి తరపు వారు చేసిన ఖర్చులు, పరిహారం కోసం రెండు కుటుంబాలతో చర్చలు జరిపినట్లు తెలిపారు పోలీసులు.

Latest News

More Articles