Monday, May 20, 2024

బస్సు ట్రక్కును ఢీ కొని 15 మంది మృతి

spot_img

ఘ‌ట‌న కెనడాలో నిమానిటోబా ప్రావిన్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్ర‌క్కును బ‌స్సు ఢీకొన్న ఘ‌ట‌న‌లో 15 మంది మృతి చెందారు. మానిటోబా ప్రావిన్స్​లోని గ్రామీణ ప్రాంతంలోని హైవే కూడలిలో 25 మంది ప్రయాణికులతో క్యాసినో వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్​ల తో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ప్రమాదం జరిగిన బస్సులో ఉన్న వారంతా వయో వృద్ధులని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కెడనా ప్రధాని జస్టిన్ ట్రూడో విచారం వ్యక్తం చేశారు.

Latest News

More Articles