Tuesday, May 21, 2024

టెన్త్‌ విద్యార్థిపై పెట్రోల్‌ పోసి నిప్పటించిన తోటి విద్యార్థులు

spot_img

ఆంధ్రప్రదేశ్‎లో దారుణ ఘటన జరిగింది. ట్యూషన్ వెళ్తున్న విద్యార్థి మీద తోటి విద్యార్థులే పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వివరాలలోకి వెళ్తే.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీ పరిధి ఉప్పలవారిపాలెంకి చెందిన ఉప్పల అమర్నాథ్‌ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ ఉదయం రాజోలులో ట్యూషన్‌కి వెళుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కూడా వెళుతుండగా మార్గంమధ్యలో రెడ్లపాలెం వద్ద అమర్నాథ్‌ స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డి మరి కొందరితో కలిసి దాడిచేసి, పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మంటలంటుకొని అమర్నాథ్ అరవడంతో.. స్థానికులు వెంటనే మంటలు ఆర్పి, గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. తనపై వెంకటేశ్వర్‌రెడ్డి, మరికొందరు పెట్రోల్‌ పోసి నిప్పంటించారని పోలీసులకు మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles