Friday, May 10, 2024

కుప్వారా ఎన్‌కౌంటర్ లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదుల హతం

spot_img

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇవాళ(శుక్రవారం) జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసుల బృందాలు కలిసి ఈ తెల్లవారుజామున గాలింపు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఎదురుపడిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. అలర్టైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి.

ఈ కాల్పుల్లో మొత్తం ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారని.. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఈ నెల 13న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ నెల 2న రాజౌరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Latest News

More Articles