తెలంగాణలోని హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో విషాదం నెలకొంది. ఎయిర్క్రాఫ్ట్ రిపేర్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తలకు గాయమై వైమానిక దళ అధికారి మరణించారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కార్పోరల్ ర్యాంక్ ఆఫీసర్ హర్వీర్ చౌదరి U-736 కిరణ్ ఎయిర్క్రాఫ్ట్ను రిపేర్ చేస్తుండగా, విమానం సీటు అకస్మాత్తుగా బౌన్స్ అయింది.
దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఆర్మీ ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎయిర్ఫోర్స్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అల్వాల్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఇది కూడా చదవండి: TSPSC కార్యదర్శిగా నవీన్ నికోలస్..అనితా రామచంద్రన్ బదిలీ..!!