Saturday, May 18, 2024

రైతు నాలుగు పైసల లాభం కండ్ల చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష

spot_img

వానాకాలం రైతుబంధు నిధులు విడుదల చేస్తున్న క్రమంలో రెండో రోజైన ఈ రోజు రైతుల ఖాతాల్లోకి రూ.1278.60 కోట్లు చేరాయి. 16 లక్షల 98,957 మంది రైతుల ఖాతాలలో ఈ డబ్బులు జమ అయినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ రెండు రోజులలో 38.42 లక్షల ఎకరాలకు సంబంధించి 39,54,138 మంది రైతుల ఖాతాలలో రూ. 1921.18 కోట్లు జమైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘రైతుబంధు పథకంతో తెలంగాణలో సాగువిప్లవం వచ్చింది. సాగునీరు రావడం, ఉచిత కరెంటుతో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా భూమి సాగులోకి వచ్చింది. వ్యవసాయ రంగం చుట్టూ అల్లుకున్న రంగాలు కూడా బలోపేతం అవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఆహారశుద్ది పరిశ్రమలతో తెలంగాణ వ్యవసాయ రంగం రూపుమారనున్నది. ఆరుగాలం కష్టపడే రైతు నాలుగు పైసల లాభం కండ్ల చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. ఆ లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. రైతుబంధు నిధులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి’ అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.

ఈ సారి విడుదలవుతున్న రైతుబంధు 11వ విడతలో రైతుల ఖాతాలలోకి రూ.72,910 కోట్లు చేరనున్నాయి. మొత్తంగా ఒక కోటి 54 లక్షల ఎకరాలకు ఆర్థిక సాయం అందనున్నది. ఈ సారి 5 లక్షల కొత్త లబ్దిదారులు పెరిగినట్లు సమాచారం.

Latest News

More Articles