సూర్యాపేట : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా సూర్యాపేట రూరల్ మండలం రామారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలవరపు వేణు పార్టీకి రాజీనామా చేశారు.
Also Read.. వారంటీ లేని ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ వస్తుంది.. ఎవరు నమ్మొద్దు
పాలవరపు వేణుతో పాటు 215 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి వారిని కోరారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ను సీఎం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.