Tuesday, May 21, 2024

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే

spot_img

హైదరాబాద్: కర్ణాటక సీఎం పీఠంపై చిక్కుముడి వీడింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జోక్యంతో కర్ణాటక సీఎం పీఠంపై ప్రతిష్టంభన తొలగింది. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.  సార్వత్రిక ఎన్నికలు ముగిసేవరకు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగనున్న డీకే శివకుమార్.

మే 20న బెంగళూరులో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని, నేడు రాత్రి 7 గంటలకు కర్ణాటక సీఎల్పీ సమావేశం ఏర్పాటుకు పార్టీ ఆదేశించింది. శాసనసభాపక్ష నేతను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకొనున్నారు. పార్టీ కేంద్ర పరిశీలకులు వెంటనే బెంగళూరుకు చేరుకోవాలని అధిష్టానం ఆదేశించింది.

Latest News

More Articles