ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్ఎఫ్)- 2024’ అవార్డుల కార్యక్రమం నిన్న(మంగళవారం) రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ అవార్డుల్లో గత ఏడాది విడుదలైన ‘జవాన్’, ‘యానిమల్’ చిత్రాలు పోటీ పడ్డాయి. జవాన్లో షారుక్ ఖాన్ నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఇక గతేడాది యానిమల్ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా నిలిచారు.
అయితే ఈ అవార్డును ..నాతో పాటు నామినేట్ అయిన సహ నటులకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు షారుక్ ఖాన్. నాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అంటే ఎంతో గౌరవం. చాలా ఏండ్ల తర్వాత ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నా. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు జవాన్ చిత్రబృందానికి కృతజ్ఞతలు అంటూ షారుఖ్ తెలిపాడు.
ఇది కూడా చదవండి:టీఎస్ ఎప్సెట్ నోటిఫికేషన్ విడుదల.. 26 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు