Thursday, May 9, 2024

గ్రూప్ -1 నోటిఫికేషన్‌ పై ట్విట్టర్‌లో కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

spot_img

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గ్రూప్-1 పోస్టుల్లో మహిళలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని (ఎక్స్) ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అణగారిన వర్గాల ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. గ్రూప్-1 హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లుంది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించగలారా? అని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రూప్ -1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారని కవిత ఫైర్ అయ్యారు. రోస్టర్ పాయింట్ల రద్దు జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. మహిళల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం కాపాడాలని కవిత డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ సిటీలో నేటి నుండి కొత్త ట్రాఫిక్ విధానం

Latest News

More Articles