Saturday, May 18, 2024

రేవంత్ రెడ్డిలో కలవరం..కుట్ర పన్నుతున్న కాంగ్రెస్..సర్వేలో విస్తుపోయే నిజాలు.!

spot_img

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కలవరం మొదలైందా?సొంత పార్టీ నుంచే చిక్కులు ఎదురువుతున్నాయా?రేవంత్ కు చెక్ పెట్టేందుకు పార్టీ వ్యూహాం రచిస్తుందా? అంటే అవుననే చెబుతున్నాయి కాంగ్రెస్ సర్వే. కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో కొన్ని విస్తువపోయే నిజాలు బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తయ్యింది. ఈ మూడు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై వ్యతిరేకత షురూ అయ్యింది. 120 రోజుల రేవంత్ రెడ్డి పాలన వల్ల ఎంపీ ఎన్నికలే ఎసరు పెట్టింది.దీంతో రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొద్దిరోజుల క్రితమే రేవంత్ రెడ్డి టేబుల్ మీదకి చేరిన కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ చేరినట్లు తెలుస్తోంది. నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్ ఈ 3 లోక్ సభ స్థానాలు తప్ప మిగతా స్థానాల్లో కాంగ్రెస్ 100 శాతం గెలిచే ఛాన్స్ లేదని కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే చెప్పేసిందట.మెదక్, పెద్దపల్లి, కరీంనగర్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉండగా…మిగతా స్థానాల్లో పోటాపోటీ ఉన్నట్లు చెప్పిన సర్వే రిపోర్టులో వెల్లడైంది. మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి స్థానాల్లో గెలుపుకు చాలా దూరంలో ఉన్న కాంగ్రెస్ ఉందని…దీంతో హడావిడిగా కొడంగల్ కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు సర్వే పేర్కొంది.

సీఎం స్థాయి వ్యక్తి షెడ్యుల్ అంటే ముందే నిర్ణయించి దానికి తగ్గట్లుగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తారు.అయితే 2 రోజుల క్రితం జరిగిన కొడంగల్ మీటింగ్ హడావిడిగా ఏర్పాటు చేసి నన్ను ఓడించాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి అనడంతో అందరూ ఆశ్చర్యపోయారట. కరువు పరిస్థితులు, రైతుల్లో వ్యతిరేకత, రైతు బంధు ఆలస్యం చేసి రైతుల నమ్మకం కోల్పోవడం, అధికారంలోకి రాగానే వెంటనే రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని దాని గురించి ప్రస్తావనే లేకపోవడం, పాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాల మీద శ్రద్ద పెట్టడం వంటివి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.మొన్నటి వరకు 100 రోజుల మా పాలనే లోక్ సభ ఎన్నికల్లో రెఫరెండం అని మాట్లాడిన రేవంత్ రెడ్డి కొడంగల్లో ఒక్కసారిగా స్వరం మార్చాడు.మహబూబ్ నగర్లో ఓడిపోతే రేవంత్ సొంత జిల్లాలో సీటు నిలబెట్టుకోలేదు అనే అపవాదు ఒక్కటే కాకుండా డీకే అరుణ ఉన్న రూపంలో రేవంత్ రెడ్డికి ముప్పు పొంచి ఉంది. ఆమె గెలిచి కేంద్ర మంత్రి అయితే గతంలో ఆమెతో ఉన్న వివాదాల కారణంగా లేని తలనొప్పి తెచ్చుకున్నట్లే.మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే దిశగా పనులు షురూ అయినట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో మున్ముందు చూడాల్సిందే.

ఇది కూడా చదవండి: రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..పూర్తి వివరాలివే.!

Latest News

More Articles