Saturday, May 4, 2024

కేకేఆర్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ కు కీలక ఆటగాడు దూరం.!

spot_img

మార్చి 22ను ఐపీఎల్ ఫీవర్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్ ను ఓ వార్త ఆందోళన కలిగిస్తోంది. గాయం కారణంగా శ్రేయస్ అయ్యార్ ఈ సీజన్ 17 ప్రారంభ మ్యాచులకు అందుబాటులో ఉండటం కష్టమనే వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ నిబంధనల మేరకు ప్రస్తుతం రంజీలో ఆడుతున్న అయ్యర్ ఫైనల్లో ముంబై తరపున ఆడి కీలక పరుగులు చేశాడు. విదర్బతో జరుగుతున్న టైటిల్ పోరు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లోనూ అయ్యర్ 95 పరుగులు చేశాడు.

కాగా వెన్నునొప్పి నుంచి కోలుకుని రంజీలో ఆడుతున్న అయ్యర్ కు గాయం మళ్లీ తిరగబెట్టిందట. దీంతో రంజీ ముగిసిన తర్వాత అయ్యార్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వెన్ను నొప్పి సమస్య కారణంగా రంజీ ఫైనల్లో ఐదోరోజు ఫీల్డింగ్ కు రాలేదు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతాడు. దీంతో రాబోయే ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకు అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉందని క్రీడ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై కోల్ కత్తా నైట్ రైడర్స్ యాజమాన్యం నుంచి అధికారికంగా త్వరలోనే ఓ ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది.

ఇది కూడా చదవండి: అదిరిపోయే స్కీం..రూ. 500పెట్టుడితే..రూ.2లక్షల మీ సొంతం.!

Latest News

More Articles