Sunday, May 19, 2024

బీజేపీకి రాజీనామా చేసి.. బీఆర్ఎస్‎లో చేరిన మహిళా మోర్చా అధ్యక్షురాలు

spot_img

ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా సిద్దిపేట పట్టణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఇంద్రాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె మరో 30 మంది మహిళా నాయకురాళ్ళతో కలిసి మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి హరీష్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. కాగా.. కొన్ని రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గోనెల గాయత్రి భవాని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

Latest News

More Articles